మార్చి 26, నేటి తెలుగు పత్రిక: అసెంబ్లీలో ఎ. రేవంత్ రెడ్డి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలుపై కీలక వివరాలు వెల్లడించారు. ఆరోగ్యశ్రీ కింద ప్రతి నెలా సుమారు రూ.89 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.పేమెంట్లు ఇవ్వడం లేదని వస్తున్న ఆరోపణలను ఖండించిన సీఎం, తమ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే భారీ బాకీలు ఉన్నాయని స్పష్టం చేశారు. మొత్తం రూ.627 కోట్లు వారసత్వంగా భారం వచ్చిందని చెప్పారు. ఇందులో రూ.240 కోట్లు ప్రభుత్వ ఆస్పత్రులకు, రూ.360 కోట్లు ప్రైవేట్ ఆస్పత్రులకు బాకీగా ఉన్నాయని వివరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం చెల్లింపులను వేగవంతం చేసిందని, ఇప్పటివరకు రూ.927 కోట్లు ప్రభుత్వ ఆస్పత్రులకు, రూ.1,480 కోట్లు ప్రైవేట్ ఆస్పత్రులకు చెల్లించినట్లు తెలిపారు.అలాగే ఆరోగ్యశ్రీ పథకం పరిధిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు సీఎం ప్రకటించారు.ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
