మార్చి 26, నేటి తెలుగు పత్రిక: నారా లోకేష్ మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. టిప్పర్ మరియు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడం కలచివేసిందన్నారు.ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని పేర్కొన్న ఆయన, గాయపడిన వారికి అవసరమైన వైద్య సహాయం అందేలా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చిన లోకేష్, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
