Breaking News

నిఖిల్ డే బృందంతో భేటీ: రేవంత్ రెడ్డి కీలక చర్చలు

మార్చి 27, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ సామాజిక కార్యకర్త నిఖిల్ డే బృందంతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలవుతున్న “ప్రజా వాణి” కార్యక్రమాన్ని మరింత విస్తరించే అంశంపై చర్చించారు.ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో కొనసాగుతున్న ఈ కార్యక్రమాన్ని రెవెన్యూ డివిజన్ స్థాయికి వికేంద్రీకరించడం ద్వారా ప్రజలకు సేవలను మరింత చేరువ చేయాలనే అంశంపై చర్చ జరిగింది.అలాగే రాజస్థాన్ ప్రభుత్వం అమలు చేస్తున్న “జన్ సూచన పోర్టల్” తరహాలో, తెలంగాణలో కూడా “ప్రజా సూచన పోర్టల్” ఏర్పాటు చేయాలని నిఖిల్ డే సూచించారు. ఇది పాలనలో పారదర్శకతను పెంచే కీలక అడుగుగా భావిస్తున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఇక తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన గిగ్ వర్కర్స్ బిల్‌పై నిఖిల్ డే ప్రశంసలు కురిపించారు. ఈ బిల్ దేశంలోనే చారిత్రాత్మకంగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ సమావేశంలో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించే దిశగా, పారదర్శక పాలనకు బాటలు వేయాలనే లక్ష్యంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *