మార్చి 27, నేటి తెలుగు పత్రిక: దేశంలో లాక్డౌన్ విధించబోతున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. చమురు సంక్షోభం నేపథ్యంలో లాక్డౌన్ వచ్చే అవకాశం ఉందన్న వార్తలను కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఖండించారు.ఈ విషయంపై స్పందించిన ఆయన… అలాంటి ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ వద్ద లేదని స్పష్టం చేశారు. లాక్డౌన్ విధించే ఆలోచన ఏదీ లేదని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు.ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. రూమర్స్ను వ్యాప్తి చేయడం వల్ల అనవసర భయాందోళనలు ఏర్పడతాయని, అలాంటి చర్యలు బాధ్యతారాహిత్యంగా మారుతాయని హెచ్చరించారు.మొత్తానికి, దేశంలో లాక్డౌన్ విధించే పరిస్థితి లేదని కేంద్రం స్పష్టత ఇచ్చింది. ప్రజలు పుకార్లను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు.
