Breaking News

రాజకీయాల్లో కొత్త మార్పుకు శ్రీకారం… కవిత స్పష్టత

మార్చి 27, నేటి తెలుగు పత్రిక: కవిత తెలంగాణ రాజకీయాల్లో సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో బలమైన కొత్త రాజకీయ శక్తి అవసరమని స్పష్టం చేశారు. సర్వోదయ తెలంగాణ సాధన లక్ష్యంగా కొత్త పార్టీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడి 12 సంవత్సరాలు గడిచినా “నీళ్లు, నిధులు, నియామకాలు” పూర్తి స్థాయిలో సాధించలేకపోయామని ఆమె విమర్శించారు.ప్రస్తుత పరిపాలనపై ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచించిన ఆమె, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.ఈ క్రమంలో ఏప్రిల్ 25న పార్టీ పేరును అధికారికంగా ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమం మునీరాబాద్, మేడ్చల్లో జరగనుంది.ఈ ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. కొత్త పార్టీతో రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయన్నదిపై ఆసక్తి నెలకొంది.

అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు.

ఆ టెండర్ను రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *