విజయవాడ. మార్చి 27 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఎన్టీఆర్ జిల్లా, 8వ డివిజ న్ శ్రీరామ్ నగర్లో ఘనం గా నిర్వహించిన శ్రీరామ నవమి వేడుకల్లో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అను రాధ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పందిరిలో ప్రత్యేక పూజలు నిర్వహిం చి, భక్తులతో కలిసి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించా రు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ, శ్రీరాముడు భారతీయ సంస్కృతిలో ధర్మానికి ప్రతీకగా నిలిచారని అన్నారు. రాముని జీవి తం ప్రతి ఒక్కరికీ ఆదర్శ మని, ఆయన పాలన రామరాజ్యం ప్రజలకు న్యాయం, సమానత్వం, శాంతి, సుసంపన్నతకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. అలాగే శ్రీరా ముని దయ కటాక్షాలు రాష్ట్రంపై ఉండి, ప్రజలకు మేలు చేసే విధంగా చంద్ర న్న పాలన కొనసాగాలని ఆకాంక్షించారు.రామరాజ్యం స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తూ, ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా పాలన సాగిస్తుందని తెలిపారు. ప్రస్తుతం సమాజంలో కూడా రాముని ఆలోచన లు, విలువలు జేఅనుస రించడం అత్యంత అవస రమని ఆమె చెప్పారు. ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పాలన కొనసా గాలని, రాష్ట్రం మొత్తం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామ నవ మి శుభాకాంక్షలు తెలుపు తూ, ప్రతి ఇంటా సుఖ శాంతులు నెలకొనాలని, ప్రతి కుటుంబం ఆనందం గా ఉండాలని ఆమె ప్రార్థించారు.

