Breaking News

శ్రీరామనవమి పురస్కరించుకుని అజిత్ సింగ్ నగర్‌లో భారీ అన్నదాన కార్యక్రమం!

విజయవాడ (మార్చి 27)నేటి తెలుగు పత్రిక: శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో డి.ఎస్ లక్ష్మీ జగన్నాథ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు ఆలయాల్లో భారీ అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. కృష్ణ జిల్లా మరియు పరిసర గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజల ఆరోగ్యం, విద్య మరియు సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఈ ఫౌండేషన్, నేడు భరతమాత మందిరం రోడ్డు (భారత్ గ్యాస్ గోడౌన్ సమీపంలో) వద్ద ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. శ్రీరామనవమి వేడుకలకు విచ్చేసిన భక్తులకు మరియు సాధారణ ప్రజలకు ఫౌండేషన్ తరపున మధ్యాహ్న భోజనం మరియు పండ్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డి.వి.ఎస్. లోకేశ్వర రావు పాల్గొని మాట్లాడారు. అనాథలు, పేద మహిళలు, పిల్లల ప్రకాశవంతమైన భవిష్యత్తు కోసం, వారి సంక్షేమం కోసం తమ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఉపాధ్యక్షులు ఎస్. మురళీ మోహన్, ప్రధాన కార్యదర్శి చల్లా బాల సుబ్రహ్మణ్య సాయి రామ్ మరియు ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఎక్సైజ్ సుంకం తగ్గింపుకు చంద్రబాబు స్వాగతం

పరిపూర్ణ మానవత్వానికి ప్రతిరూపం శ్రీరాముడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *