మార్చి 28, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన DEE Telangana (DEET) యాప్పై అవగాహన పెరుగుతోంది. ప్రతి సంవత్సరం పదో తరగతి నుంచి పీజీ వరకు చదువులు పూర్తి చేసే వారి సంఖ్య పెరుగుతున్నా, సరైన సమాచారం లేక చాలామంది ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఈ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు.ఈ యాప్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. యాప్లో నమోదు చేసుకున్న అభ్యర్థులకు వారి విద్యార్హతలు, నైపుణ్యాల ఆధారంగా జాబ్ నోటిఫికేషన్లు అందుతాయి.యాప్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా సులభంగా ఉంటుంది. వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, నైపుణ్యాలు నమోదు చేసి, సంబంధిత డాక్యుమెంట్లు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. నోటిఫికేషన్లు ఆన్ చేసుకుంటే కొత్త ఉద్యోగ సమాచారం వెంటనే అందుతుంది.ముఖ్యంగా, ఈ యాప్ కృత్రిమ మేధ (AI) ఆధారంగా పనిచేస్తూ, అభ్యర్థుల ప్రొఫైల్కు సరిపోయే ఉద్యోగాలను సూచిస్తుంది.ఇక ఉద్యోగాలు ఇచ్చే సంస్థలు కూడా ఈ ప్లాట్ఫామ్లో నమోదు కావచ్చు. దీంతో ఉద్యోగార్థులు, ఉద్యోగదాతలు ఒకే వేదికపై కలుసుకునే అవకాశం ఉంటుంది.ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే లక్షకు పైగా అభ్యర్థులు చదువులు పూర్తి చేసిన నేపథ్యంలో, ఇలాంటి డిజిటల్ ప్లాట్ఫామ్లు నిరుద్యోగ సమస్యను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు భావిస్తున్నారు.
