Breaking News

తెలంగాణలో కొత్త పార్టీకి శ్రీకారం… కవిత సంచలన ప్రకటన

మార్చి 28, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామంగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత కొత్త పార్టీ స్థాపనను ప్రకటించారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ నిర్ణయాన్ని వెల్లడించిన ఆమె, రాష్ట్ర రాజకీయాల్లో కొత్త దిశ తీసుకురావాలని సంకల్పం వ్యక్తం చేశారు.ఏప్రిల్ 25న మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో పార్టీ జెండా ఆవిష్కరణతో పాటు అజెండాను ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల ఆశయాలను ప్రతిబింబించే విధంగా పార్టీ కార్యక్రమాలు ఉండనున్నాయని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సంవత్సరాలు గడిచినా “నీళ్లు, నిధులు, నియామకాలు” లక్ష్యాలు పూర్తిగా నెరవేరలేదని కవిత అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో సర్వోదయ తెలంగాణ సాధనే ప్రధాన లక్ష్యంగా కొత్త పార్టీ ముందుకు వస్తుందని వివరించారు.నిజామాబాద్‌తో తన అనుబంధాన్ని ప్రస్తావిస్తూ, తెలంగాణ మట్టిలో ఉన్న శక్తి దేశ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉందని చెప్పారు.ఇప్పటికే రాష్ట్రంలో ప్రధాన పార్టీల మధ్య పోటీ కొనసాగుతున్న సమయంలో, ఈ కొత్త పార్టీ ప్రవేశం రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఏప్రిల్ 25న ప్రకటించనున్న పూర్తి అజెండాపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్… DEET యాప్‌తో ఉద్యోగ సమాచారం మీ చేతిలోనే

ఐపీఎల్ వేళ బెట్టింగ్‌పై సజ్జనార్ సీరియస్ వార్నింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *