Breaking News

mlc kavitha visits jagityal District

ఎమ్మెల్సీ కవిత జగిత్యాల జిల్లాలో పర్యటన

జగిత్యాల గడ్డ బీఆర్‌ఎస్‌కు అడ్డా

జగిత్యాల జిల్లా: డిసెంబర్ 15

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత జగిత్యాల జిల్లాలో పర్యటించారు. ధరూర్‌ బైపాస్‌ వద్ద ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికారు. భారీగా మహిళలు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చి, కవితను ఆదరించారు.

గవర్నర్‌ను కలిసిన బీఆర్ఎస్ నేతలు.. పొంగులేటిపై మైనింగ్ ఆరోపణల ఫిర్యాదు

ఈ సందర్భంగా, కవిత అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం, మహిళలతో కలిసి బతుకమ్మ నృత్యం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత, “జగిత్యాల అంటేనే బీఆర్‌ఎస్‌ అడ్డా, ఇది మీ అందర్నీ చూస్తే తెలుస్తోంది” అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ, “తెలంగాణ తల్లి, బతుకమ్మను కాంగ్రెస్ ప్రభుత్వం దూరం చేస్తున్నది” అని ఆరోపించారు.

కావలసిన ప్రతి మహిళకు చేయాల్సిన హామీలను నిలబెట్టకున్న రేవంత్ రెడ్డి సర్కార్‌ను తప్పుబట్టారు. “ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు రూ.2500 ఇస్తామని చెప్పిన హామీ ఏమైందో చూడాలి” అని కవిత ప్రశ్నించారు.

కల్తీ ఆహారంపై యుద్ధం.. ప్రత్యేక వ్యవస్థతో కఠిన చర్యలు: సీఎం రేవంత్

ఈ సందర్భంగా, బతుకమ్మ పండుగ విషయంలో మహిళల ఆందోళనను గమనించి, వారి అభిప్రాయాలను సమర్థించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *