జగిత్యాల గడ్డ బీఆర్ఎస్కు అడ్డా
జగిత్యాల జిల్లా: డిసెంబర్ 15
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జగిత్యాల జిల్లాలో పర్యటించారు. ధరూర్ బైపాస్ వద్ద ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికారు. భారీగా మహిళలు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చి, కవితను ఆదరించారు.
ఈ సందర్భంగా, కవిత అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం, మహిళలతో కలిసి బతుకమ్మ నృత్యం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత, “జగిత్యాల అంటేనే బీఆర్ఎస్ అడ్డా, ఇది మీ అందర్నీ చూస్తే తెలుస్తోంది” అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ, “తెలంగాణ తల్లి, బతుకమ్మను కాంగ్రెస్ ప్రభుత్వం దూరం చేస్తున్నది” అని ఆరోపించారు.
కావలసిన ప్రతి మహిళకు చేయాల్సిన హామీలను నిలబెట్టకున్న రేవంత్ రెడ్డి సర్కార్ను తప్పుబట్టారు. “ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు రూ.2500 ఇస్తామని చెప్పిన హామీ ఏమైందో చూడాలి” అని కవిత ప్రశ్నించారు.
ఈ సందర్భంగా, బతుకమ్మ పండుగ విషయంలో మహిళల ఆందోళనను గమనించి, వారి అభిప్రాయాలను సమర్థించారు.
