Breaking News

Orthodox virtue is a real way of life

సనాతన ధర్మమే నిజమైన జీవన మార్గం

సనాతన ధర్మమే నిజమైన జీవన మార్గం: ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు

అయోధ్యలో అపోలో ఉచిత ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ప్రారంభం

తిరుమల, శ్రీశైలం, కేదార్ నాథ్, బద్రీనాథ్‌లలోనూ సేవా కేంద్రాలు ఏర్పాటు

గౌరవంతో వైద్యం అందించడం సనాతన ధర్మమన్న ఉపాసన

తెలంగాణకు అదనపు నిధుల కోసం కేంద్రాన్ని కలిసిన భట్టి

తాతయ్య మాటలే స్పూర్తి అని వెల్లడించిన ఉపాసన

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య, అపోలో ఫౌండేషన్ వైస్ చైర్ పర్సన్ ఉపాసన, సనాతన ధర్మంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోగుల పట్ల గౌరవంతో వ్యవహరిస్తూ వారికి వైద్యం అందించడం నిజమైన సనాతన ధర్మమని, ఈ సిద్ధాంతం తమకు వారి తాతయ్య నుండి అందిందని ఆమె తెలిపారు.

“రోగుల పట్ల సానుభూతితో వ్యవహరించాలి. గౌరవంగా వైద్యం అందించాలి అని మా తాతయ్య మాకు నేర్పించారు. ఆయన మాటలే మాకు మార్గదర్శకాలు. ఈ స్ఫూర్తితో తిరుమల, శ్రీశైలం, కేదార్ నాథ్, బద్రీనాథ్‌లలో ఉచిత ఎమర్జెన్సీ కేర్ సెంటర్లు ఏర్పాటు చేశాం. తాజాగా అయోధ్య రామ మందిరం వద్ద కూడా అపోలో ఉచిత ఎమర్జెన్సీ కేర్ సెంటర్‌ను ప్రారంభించాం. ఈ కేంద్రం ద్వారా అత్యవసర వైద్య సేవలను అందించేందుకు సిద్ధంగా ఉన్నాం” అని ఉపాసన తెలిపారు.

ఆ సేవా కార్యక్రమంలో తమకు మద్దతుగా నిలిచిన వారికి ఉపాసన కృతజ్ఞతలు తెలిపారు. “సామాజిక బాధ్యతగా, ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఆరోగ్య సేవలను అందించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాం. ఇది సనాతన ధర్మానికి మేము ఇచ్చే మద్దతు” అంటూ ఉపాసన తన భావాలను పంచుకున్నారు.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు

ఈ ఉచిత సేవా కార్యక్రమం అపోలో ఫౌండేషన్ సేవా పట్ల వారి కట్టుబాటు, సమాజానికి వారు అందిస్తున్న అమూల్యమైన సహకారాన్ని తెలియజేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *