Breaking News

కేరళ ఎన్నికల్లో కీలక ప్రచారం.. రేవంత్ రెడ్డి రెండు రోజుల పర్యటన

హైదరాబాద్, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు రోజుల పర్యటనకు వెళ్లారు.ఈ పర్యటనలో భాగంగా తిరువనంతపురంలో రోడ్‌షోతో కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. ఎస్‌ఎం లాక్ జంక్షన్ నుంచి ముట్టతార వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం భారతన్నూర్‌లో కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు. తర్వాత పూవాచల్ ప్రాంతంలో మరో రోడ్‌షోలో పాల్గొని, ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. సాయంత్రం అలప్పుజలో జరిగే సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం ఎర్నాకులంకు చేరుకుని అక్కడి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఈ ప్రచార యాత్ర కొనసాగనుంది.

ఇందిరమ్మ ఇళ్ల కోసం హైదరాబాద్‌లో ఖాళీ స్థలాల పరిశీలన

బాల్క సుమన్ వ్యాఖ్యలపై పొన్నం ఫైర్.. కేసు నమోదు చేయాలని డిమాండ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *