హైదరాబాద్, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు నేడు పుదుచ్చేరికు బయలుదేరుతున్నారు.మూడు రోజుల పాటు అక్కడ కొనసాగనున్న ఈ ప్రచారంలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనను ఏఐసీసీ ఎన్నికల పరిశీలకుడిగా, స్టార్ క్యాంపెయినర్గా నియమించింది.పుదుచ్చేరి రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. పార్టీ విజయానికి అనుకూల వాతావరణం సృష్టించడమే లక్ష్యంగా కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
