అమరావతి, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు.ఎక్స్ వేదికగా స్పందించిన సీఎం, రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజాసంక్షేమం కోసం కూటమి పక్షాల ఐక్యతకు పవన్ కళ్యాణ్ అందిస్తున్న సహకారం అభినందనీయం అని పేర్కొన్నారు. తన అనుభవానికి తోడుగా పవన్ వంటి ప్రజానేతలు కలిసి పనిచేస్తే రాష్ట్రానికి, దేశానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. గత 20 నెలల పాలన దీనికి నిదర్శనమని వెల్లడించారు.ఇక విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ కూడా స్పందిస్తూ, పవన్ కళ్యాణ్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి స్ఫూర్తిని బలపరుస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.కూటమి ఐక్యత ఇలాగే కొనసాగాలని నేతలు ఆకాంక్షించారు.
