Breaking News

రాజధాని అంశంపై జగన్ కీలక వ్యాఖ్యలు

అమరావతి, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రాలకు సంబంధించి రాజ్యాంగంలో “రాజధాని” అనే పదం ఎక్కడా ప్రస్తావించలేదని వైసీపీ అధినేత వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, రాజధాని నిర్ణయం రాష్ట్రాల పరిధిలోనే ఉంటుందని, ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌లో స్పష్టం చేసిందని తెలిపారు.తనకు ఈ విషయంలో ఎలాంటి పాత్ర లేదని కేంద్రం పేర్కొన్నదని జగన్ అన్నారు. ప్రజలను పక్కదారి పట్టించేందుకు అమరావతి బిల్లుపై డ్రామా ఆడుతున్నారని సీఎం ఎన్. చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు.అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదని ప్రభుత్వ మంత్రులే చెప్పారని ఆయన పేర్కొన్నారు. రాజధాని అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

గోదావరి కాలుష్యంపై పరిశ్రమలకు మంత్రి దుర్గేష్ హెచ్చరిక

ఏపీలో మినీ ఎన్నికల హీట్.. క్యాడర్‌కు సిద్ధంగా ఉండాలని మూడు పార్టీల పిలుపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *