Breaking News

రేషన్ కార్డులపై కత్తి.. తెలంగాణలో 1.40 లక్షల కార్డులు రద్దు

ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: రేషన్ కార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత లేకుండా రేషన్ పొందుతున్న వారిపై చర్యలు తీసుకుంటూ, తెలంగాణలో సుమారు 1.40 లక్షల రేషన్ కార్డులను రద్దు చేసింది. దీంతో ఈ లబ్ధిదారులకు రేషన్ సరుకులు నిలిపివేయబడ్డాయి.రేషన్ వ్యవస్థలో పారదర్శకత కోసం రీవెరిఫికేషన్ చేపట్టిన కేంద్రం, అక్రమంగా పొందిన కార్డులను తొలగిస్తున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా కూడా భారీ స్థాయిలో ఈ చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 41 లక్షలకుపైగా కార్డులు రద్దు చేసినట్లు వెల్లడించింది.ఆధార్ బయోమెట్రిక్ విధానం ద్వారా సరుకుల పంపిణీని కట్టుదిట్టం చేయడంతో అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు చెబుతున్నారు. వివిధ శాఖల డేటా ఆధారంగా అనర్హులను గుర్తించి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.అయితే మరోవైపు తెలంగాణలో కొత్తగా లక్షలాది రేషన్ కార్డులు జారీ కావడం విశేషం. అర్హులకు మాత్రమే ప్రయోజనం అందేలా ఈ ప్రక్రియ కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది.

సమగ్ర వ్యవసాయ ప్రణాళిక రూపొందించాలి

రైతులకు గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 15 నుంచి రైతు భరోసా నిధుల జమ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *