ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతాయన్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఇంధన ధరలు పెంచే ఉద్దేశం ప్రస్తుతం లేదని తేల్చి చెప్పింది.ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ, భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచబోమని పెట్రోలియం శాఖ వెల్లడించింది. గ్యాస్ (LPG) ధరల పెంపు కూడా లేదని స్పష్టం చేసింది. దేశంలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, ప్రజలు భయపడి అధికంగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని, అధికారిక ప్రకటనలపై మాత్రమే విశ్వాసం ఉంచాలని కేంద్రం సూచించింది.
