కరీంనగర్,ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: రేకుర్తి ప్రాంతంలో సేవలందిస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ డా. భాస్కర్ మడేకర్ చారిటబుల్ కంటి ఆసుపత్రి*కి నూతన ట్రస్ట్ బోర్డు సభ్యులను నియమించారు. చైర్మన్ గా ప్రకాష్ హోల్లా,కార్యదర్శి గా Engineer కోల అన్నారెడ్డి, కోశాధికారి గా బొమ్మ పవన్ కుమార్, ఉపాధ్యక్షులుగా చిదుర సురేష్,కార్యవర్గ సభ్యులు గా,కొండ వేణు మూర్తిడా. T. మురళీధర్ రావు లను నియమితులయ్యారు.నూతన ట్రస్ట్ బోర్డు సభ్యులు మాట్లాడుతూ, సమాజంలోని పేద మరియు అవసరమైన వర్గాలకు నాణ్యమైన, తక్కువ ఖర్చుతో కంటి వైద్య సేవలను అందించడంలో మరింత కృషి చేస్తామని తెలిపారు.ఆసుపత్రి ద్వారా మరిన్ని ఉచిత కంటి పరీక్షా శిబిరాలు నిర్వహించడం, గ్రామీణ ప్రాంతాల్లో సేవలను విస్తరించడం మరియు కంటి ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు.లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ సీనియర్ సభ్యులు నూతన ట్రస్ట్ బోర్డు సభ్యులకు అభినందనలు తెలియజేసి, వారి నాయకత్వంలో మరింత సేవా కార్యక్రమాలు విజయవంతం అవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
