Breaking News

అమరావతికి మద్దతు, కానీ విభజన హామీలు నెరవేరాలి: రేణుకా చౌదరి

ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: ఏపీ రాజధాని అమరావతిపై 12 సంవత్సరాల అస్పష్టత పరిష్కారం కావాలని రేణుకా చౌదరి పేర్కొన్నారు. విభజన చట్టంలోని హామీలు ఇప్పటికీ పూర్తిగా అమలులోకి రాలేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.చౌదరి మాట్లాడుతూ, “ఈ బిల్లు 12 ఏళ్ల తర్వాత వచ్చినప్పటికీ, హామీలు ఎందుకు నెరవేరలేదో స్పష్టత ఇవ్వాలి. రాజధానిపై అస్పష్టత కారణంగా పెట్టుబడులు వెనక్కి వచ్చాయి. దుగరాజపట్నం పోర్ట్, ఇతర హామీలు కూడా నెరవేరాల్సి ఉంది,” అని తెలిపారు. అమరావతిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం అత్యవసరం అని, కేవలం బిల్లు పెట్టడమే కాకుండా, హామీలన్నీ సమయానికి అమలు చేయవలసిన అవసరాన్ని చౌదరి హైలైట్ చేశారు.వీటితోపాటు, కేంద్రం, రాష్ట్రం రాజధానిపై స్పష్టమైన ప్రణాళికను ప్రకటించాలని మరియు పెట్టుబడిదారులకు భరోసా ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.

ఇందిరమ్మ ఇళ్ల కోసం హైదరాబాద్‌లో ఖాళీ స్థలాల పరిశీలన

బాల్క సుమన్ వ్యాఖ్యలపై పొన్నం ఫైర్.. కేసు నమోదు చేయాలని డిమాండ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *