Breaking News

చిక్కడపల్లి హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా..మహేష్ కుమార్ గౌడ్ దంపతుల ప్రత్యేక దర్శనం

హైదరాబాద్,ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని చిక్కడపల్లి హనుమాన్ దేవాలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తన దంపతులతో కలిసి ఆలయాన్ని సందర్శించి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆయన రాష్ట్ర ప్రజల శాంతి, సమృద్ధి కోసం ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. ఆలయ వాతావరణం భక్తి పరవశంతో నిండిపోయింది.ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, యువజన కాంగ్రెస్ నాయకులు అరవింద్ కుమార్, చైర్మన్ జానకి సుధాకర్, ఆలయ అధికారులు మరియు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

హేట్ స్పీచ్ బిల్లు కాదు.. “ఫ్రీ స్పీచ్‌పై ఆంక్షల బిల్లు” – హరీష్ రావు విమర్శలు

హైదరాబాద్‌లో అంతర్జాతీయ సైబర్ స్కామ్: 600 సిమ్ కార్డులు, కోట్ల రూపాయల మోసం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *