అమరావతి, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ కూటమి ఎంపీలకు అభినందనలు తెలిపారు.ఈ బిల్లుకు మద్దతు తెలిపిన పలు రాజకీయ పార్టీల నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అమరావతి అభివృద్ధికి ఇది కీలక ముందడుగు అని లోకేష్ పేర్కొన్నారు.అదేవిధంగా, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి మంత్రి నారా లోకేష్ మరియు కూటమి ఎంపీలు ధన్యవాదాలు తెలిపారు.



