Breaking News

గండ్రపల్లిలో మిస్టరీ డెత్స్.. భయంతో గ్రామం ఖాళీ!

కరీంనగర్, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: గండ్రపల్లి గ్రామంలో వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. గత మూడు నెలల్లో 28 మంది మృతి చెందడంతో గ్రామం మొత్తం భయాందోళనలకు గురైంది. వృద్ధులతో పాటు యువకులు కూడా చనిపోవడం స్థానికుల్లో మరింత ఆందోళన పెంచింది.ఈ పరిణామాలతో గ్రామానికి ఏదో అరిష్టం సోకిందనే నమ్మకం బలపడింది. గ్రామ పెద్దలు, పురోహితులను సంప్రదించగా, కీడు నివారణ కోసం ప్రత్యేక పూజలు చేయాలని సూచించారు.దీంతో గ్రామస్తులు ఒకేసారి ఇళ్లకు తాళాలు వేసి, కుటుంబాలతో కలిసి గ్రామం బయటకు వెళ్లి సంప్రదాయ పూజలు నిర్వహించారు. కొంతసేపు గండ్రపల్లి పూర్తిగా నిర్మానుష్యంగా మారింది.ఇక మరోవైపు, ఈ మరణాల వెనుక అసలు కారణాలు ఏమిటన్నది ప్రశ్నగా మారింది. కలుషిత నీరు, అంటువ్యాధులు లేదా ఇతర ఆరోగ్య సమస్యలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.నిపుణులు వెంటనే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, గ్రామస్తుల ఆరోగ్యాన్ని పరీక్షించాలని సూచిస్తున్నారు. మూఢనమ్మకాల కంటే శాస్త్రీయ దృష్టితో సమస్యను పరిశీలించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

హేట్ స్పీచ్ బిల్లు కాదు.. “ఫ్రీ స్పీచ్‌పై ఆంక్షల బిల్లు” – హరీష్ రావు విమర్శలు

చిక్కడపల్లి హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా..మహేష్ కుమార్ గౌడ్ దంపతుల ప్రత్యేక దర్శనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *