హైదరాబాద్, ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ పరిధిలో జరుగుతున్న నిర్మాణ పనులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించారు.ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (FCDA) కార్యాలయ భవన నిర్మాణ పురోగతిని సమీక్షించిన సీఎం, ప్రణాళికల అమలులో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు.అదేవిధంగా, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU)కి చెందిన భవన సముదాయాలను పరిశీలించి, పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు.సీఎం వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వైస్ ఛాన్సలర్ సుబ్బారావు తదితర అధికారులు పాల్గొన్నారు.
