మచిలీపట్నం, ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: వైకాపా నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై కృష్ణా జిల్లా చిలకలపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.మచిలీపట్నంలోని కొబ్బరితోట ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన ఇంటిని అధికారులు కూల్చివేయగా, అక్కడికి చేరుకున్న పేర్ని నాని తన అనుచరులతో కలిసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.ఈ సందర్భంగా అధికారులను బెదిరించారనే ఆరోపణలపై పోలీసు అధికారుల సంఘం ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
