హైదరాబాద్, ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: ఈనెల 25న మునీరాబాద్లో నిర్వహించనున్న పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్లపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక సమీక్ష నిర్వహించారు.బంజారాహిల్స్లోని జాగృతి కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి రానున్న నాయకులు, కార్యకర్తల కోసం చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు.సభకు ముందు, తర్వాత నిర్వహించే కార్యక్రమాలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిన కవిత, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సమన్వయంతో పని చేయాలని నేతలకు సూచించారు.
