Breaking News

సీఎస్ఆర్ నిధులకు కొత్త పాలసీ.. ₹2,500 కోట్ల లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు

హైదరాబాద్, ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర అభివృద్ధిలో కార్పొరేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలో సీఎస్ఆర్ నిధుల వినియోగానికి ప్రత్యేక పాలసీ రూపొందిస్తోంది.ప్రస్తుతం రూ.700–800 కోట్లుగా ఉన్న సీఎస్ఆర్ వ్యయాన్ని భారీగా పెంచి రూ.2,500 కోట్లకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రత్యేక సంస్థ ఏర్పాటు

ఈ లక్ష్య సాధన కోసం ‘తెలంగాణ సీఎస్ఆర్’ పేరుతో స్వయంప్రతిపత్తి గల సంస్థను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ సంస్థ ద్వారా నిధుల సేకరణ, వినియోగంలో పారదర్శకత పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇందిరమ్మ పథకంలో కొత్త మలుపు: లబ్దిదారులకు జూన్‌లో 1 లక్ష ఇళ్లు నిర్మాణం ప్రారంభం

ప్రధాన లక్ష్యాలు

  • రాష్ట్రానికి వచ్చే సీఎస్ఆర్ వాటాను 3% నుంచి 10%కి పెంపు
  • విద్య, వైద్యం, పర్యావరణ రంగాలకు ప్రాధాన్యం
  • వెనుకబడిన జిల్లాలకు నిధుల మళ్లింపు

ఎందుకు ఈ నిర్ణయం?

ఇప్పటివరకు సీఎస్ఆర్ నిధులు ప్రధానంగా హైదరాబాద్ పరిసరాలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. కొత్త విధానంతో రాష్ట్రవ్యాప్తంగా సమతుల అభివృద్ధి సాధించాలని లక్ష్యం.

భవిష్యత్ ప్రణాళిక

ఇతర రాష్ట్రాల మోడళ్లను అధ్యయనం చేసి సమగ్ర రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. త్వరలో పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపి పాలసీకి తుది రూపు ఇవ్వనున్నారు.

కవిత: “TRS పేరు ఫ్రీ, ఎవరైనా వాడుకోచ్చు”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *