Breaking News

ఫీజుల దోపిడీ ఆపాలి.. లేదంటే ఆందోళనలు: కవిత హెచ్చరిక

హైదరాబాద్, ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల పెంపుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గట్టి హెచ్చరిక జారీ చేశారు.స్కూల్స్ యాజమాన్యాలు ఒకేసారి 30 నుంచి 40 శాతం వరకు ఫీజులు పెంచి తల్లిదండ్రులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆమె విమర్శించారు. ఈ పరిస్థితిని అరికట్టేందుకు వెంటనే ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఏటా 8 శాతం కంటే ఎక్కువ ఫీజు పెంపును నిషేధించాలని సూచించిన కవిత, ఈ అంశంపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని కోరారు.కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫుడ్ సేఫ్టీ, టీచర్ల సంక్షేమంపై నిర్లక్ష్యం ఉందని ఆరోపిస్తూ నారాయణ స్కూల్స్, చైతన్య స్కూల్స్ వంటి సంస్థలపై తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా స్కూల్స్ ముందు నిరసనలు చేపడతామని స్పష్టం చేశారు.

అకాల వర్షాలపై తెలంగాణ సర్కార్ అలర్ట్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

డిజిటల్ చెల్లింపులతో జాగ్రత్త.. వ్యాపారులకు సీపీ సజ్జనార్ హెచ్చరిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *