ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: క్యూనెట్ మోసం కేసులో సిట్ విచారణ కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు, మరికొందరిని కస్టడీలోకి తీసుకుని విచారణను మరింత వేగవంతం చేశారు.దర్యాప్తులో నిందితులు ఐటీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడ్డట్లు బయటపడింది. స్టార్ హోటళ్లు, ప్రముఖ కేఫ్లలో సెమినార్లు నిర్వహిస్తూ అధిక లాభాల ఆశ చూపించి పెట్టుబడులు పెట్టించారని అధికారులు గుర్తించారు.రూ.5 నుంచి రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే కోట్ల రూపాయలు సంపాదిస్తారని మభ్యపెట్టిన మోసగాళ్లు, బ్యాంక్ లోన్లు ఇప్పించి మరింతగా బాధితులను ఉరితాడులోకి దించారు. కానీ ఎలాంటి లాభాలు రాకపోవడంతో బాధితులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.పెట్టుబడికి ముందు బాధితులతో బాండ్లు రాయించుకుని, తర్వాత ఎలాంటి ఫిర్యాదులు చేయకుండా ఒత్తిడి చేసినట్లు సిట్ వెల్లడించింది. ఎవరు ఎదురు తిరిగినా బెదిరింపులకు దిగినట్టు కూడా తెలిసింది.ఈ స్కామ్ వెనుక ఉన్న కీలక మాస్టర్మైండ్స్పై పోలీసులు దృష్టి పెట్టారు. త్వరలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని సమాచారం.
