ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా భయాందోళనలు సృష్టించేందుకు సిద్ధమైన ఉగ్రవాద కుట్రను ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ ఛేదించింది. ‘గజ్వా-ఎ-హింద్’ పేరిట కార్యకలాపాలు నిర్వహిస్తున్న నలుగురు అనుమానితులను అరెస్ట్ చేసి కీలక నెట్వర్క్ను బయటపెట్టింది.దర్యాప్తులో నిందితులు గ్యాస్ సిలిండర్లకు నిప్పుపెట్టి దహనకాండలు సృష్టించాలనే ప్లాన్ చేసినట్లు తేలింది. చిన్న స్థాయి ఘటనలను సృష్టించి, వాటి వీడియోలను విదేశీ హ్యాండ్లర్లకు పంపుతూ డబ్బులు సంపాదిస్తున్నట్లు గుర్తించారు.సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్కు చెందిన హ్యాండ్లర్లతో సంబంధాలు కొనసాగిస్తూ దేశ భద్రతకు ముప్పుగా మారినట్లు అధికారులు తెలిపారు. కీలక నిందితుడు సాకిబ్ అలియాస్ డేవిడ్ ఈ ముఠాలో ప్రధాన పాత్ర పోషించినట్లు వెల్లడైంది.నిందితులు పలు నగరాల్లో కీలక ప్రాంతాలపై రెక్కీ నిర్వహించి సమాచారం పంపినట్లు, వారి వద్ద నుంచి పేలుడు సామగ్రికి సంబంధించిన పదార్థాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.ఈ ఘటనతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఈ నెట్వర్క్కు సంబంధించిన మరిన్ని వ్యక్తులపై ఏటీఎస్ దర్యాప్తు కొనసాగిస్తోంది.
