Breaking News

సీఎన్‌జీ ధరలు పెరిగాయి.. కిలోకు ₹2.50 షాక్

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: ఇంధన ధరల పెరుగుదల కొనసాగుతున్న నేపథ్యంలో సీఎన్‌జీ వినియోగదారులకు మరో దెబ్బ తగిలింది. టొరెంట్ గ్యాస్ సంస్థ సీఎన్‌జీ ధరను కిలోకు ₹2.50 మేర పెంచింది.ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరగడం, పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం వల్ల ఈ పెంపు జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవలే వాణిజ్య ఎల్‌పిజి, ఏవియేషన్ ఇంధన ధరలు కూడా పెరగడంతో ఇంధన వ్యయం మొత్తం పెరిగింది.సీఎన్‌జీ ధరల పెంపుతో ఆటో డ్రైవర్లు, ట్రాన్స్‌పోర్ట్ రంగం, సామాన్య వాహనదారులపై ఆర్థిక భారం పెరుగుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఖర్చులతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇది మరింత భారంగా మారింది.ఇంధన ధరల పెరుగుదల ప్రభావం రవాణా, వ్యాపార రంగాలపై కూడా పడే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హైదరాబాద్‌లో టెస్లా ఎంట్రీకి రంగం సిద్ధం.. తెలంగాణలో ఈవీ రంగానికి భారీ ఊపు

నిత్యావసరాల ధరల మంట.. ఇప్పుడు బ్రెడ్ కూడా ఖరీదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *