ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉట్నూర్ ఐటిడిఎ కార్యాలయాన్ని సందర్శించి అక్కడి వ్యవస్థపై సమీక్ష నిర్వహించారు. శిక్షణ పొందుతున్న డిప్యూటీ కలెక్టర్లతో మాట్లాడి, వారి పనితీరు, సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు.ఐటిడిఎ కార్యకలాపాలపై అధికారులతో చర్చించిన ఆయన, గిరిజన అభివృద్ధిలో ఈ సంస్థ పాత్ర కీలకమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఐటిడిఎను మరింత బలోపేతం చేసి, పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు.గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.


