ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: ఉత్తర తెలంగాణ అభివృద్ధికి మరింత వేగం పెంచుతూ రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 6న బాసర ఆలయంలో పర్యటించి, రూ.300 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.ఆలయాన్ని జాతీయ స్థాయి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మాస్టర్ ప్లాన్ అమలు చేయనున్నారు. భక్తులకు మెరుగైన సదుపాయాలు, ఆధునిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భారీ ఏర్పాట్లు కూడా చేయనున్నారు.ఇక ఆదిలాబాద్ జిల్లాలో సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. సాగునీరు, విద్య రంగాల్లో రూ.600 కోట్లతో పనులు చేపట్టనుండగా, బోథ్ నియోజకవర్గంలో రూ.1200 కోట్లతో ఆధునిక రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టనున్నారు.ఈ ప్రాజెక్టులతో బాసరతో పాటు ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిలో కీలక మలుపు తిరగనుంది.
