ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: కర్ణాటకలోని రాయచూరు జిల్లా సింధనూరు ప్రాంతంలో స్వర్గీయ ఎన్. టి. రామారావు కాంస్య విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి హెచ్. డి. కుమారస్వామి, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ తో కలిసి మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.తెలుగు సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ సేవలను స్మరించుకుంటూ ఆయన వారసత్వాన్ని కొనసాగించాలని నేతలు పేర్కొన్నారు.








