ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. డ్రైవింగ్ చేస్తూ సెల్ఫోన్ ఉపయోగిస్తున్న 308 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు.ద్విచక్ర వాహనదారులు ఎక్కువగా నిబంధనలు ఉల్లంఘించినట్లు పోలీసులు గుర్తించారు. సెల్ఫోన్ వినియోగం వల్ల డ్రైవర్ దృష్టి మరలిపోవడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.ఇకపై ఇలాంటి ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామని, నగరంలో తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. వాహనదారులు నిబంధనలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు.
