Breaking News

విద్యా విధానంపై కేంద్ర-తమిళనాడు ఢీ.. స్టాలిన్‌పై ధర్మేంద్ర ప్రధాన్ విమర్శలు

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: జాతీయ విద్యా విధానం అమలుపై కేంద్రం మరియు తమిళనాడు మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ధర్మేంద్ర ప్రధాన్, సీఎం ఎం. కె. స్టాలిన్ చేసిన హిందీ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.హిందీ రుద్దుతున్నారన్న వ్యాఖ్యలు వాస్తవానికి విరుద్ధమని, జాతీయ విద్యా విధానం 2020 భాషా స్వేచ్ఛను ప్రోత్సహిస్తుందని ఆయన స్పష్టం చేశారు. మాతృభాషతో పాటు ఇతర భాషలు నేర్చుకోవడం విద్యార్థులకు ఉపయోగకరమని పేర్కొన్నారు.అలాగే రాష్ట్రంలో PM SHRI పాఠశాలలు, జవహర్ నవోదయ విద్యాలయలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని ఆరోపించారు.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాజకీయాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు.

ప్రత్యామ్నాయ మార్గాలతో ఇంధన భద్రత బలోపేతం

మెట్రోలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. ₹5000 వరకు జరిమానా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *