మైలవరం, ఏప్రిల్ 04, (నేటి తెలుగు పత్రిక): మైలవరం మండలం లోని చిలుకూరివారి గూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1991-92 సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన పూర్వవిద్యార్థులు పాఠశాలకు అవసరం అయినా బల్లలను బహుకరించారు. ఉపాధ్యాయులు ఉపయోగించుకోవటానికి వీలుగా తయారు చేయించిన 12 బల్లలను శనివారం ప్రధానోపాధ్యాయురాలు అన్నే. కుసుమ కుమారి ద్వారా పాఠశాలకు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో సౌకర్యాల కల్పనకు తమ వంతు సహకారం అందిస్తామని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు గుంటక ప్రసాద్ రెడ్డి, వై.నరసింహారావు, బసివి రెడ్డి, అప్పారావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
