ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారి గౌరవార్థం ఏర్పాటు చేసిన విందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, జస్టిస్ సూర్యకాంత్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.శంషాబాద్లోని నోవాటెల్ హోటల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ విందు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్తో పాటు ఇతర న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
