ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: న్యూయార్క్ నగరంలోని కొలంబియా బిజినెస్ స్కూల్లో నిర్వహించిన 21వ ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్లో కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రయాణాన్ని ఆయన వివరించారు.తెలంగాణ రాష్ట్రం పోరాటం, త్యాగాల ఫలితంగా ఏర్పడిందని పేర్కొంటూ, కేసీఆర్ నాయకత్వంలో తక్కువ సమయంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు.కాన్ఫరెన్స్లో వ్యాపారం, ఆవిష్కరణలు, భవిష్యత్ విధానాలపై జరిగిన చర్చలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులకు, హాజరైన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
