Breaking News

జర్నలిస్ట్ కుటుంబాన్ని పరామర్శించిన జనసేన

ఎన్టీఆర్ జిల్లా మైలవరం, ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: సమాజం కోసం అలిసిపోనిది కలం.. ఆ కలం కష్టంలో ఉంటే అండగా నిలవడం మనందరి బాధ్యత.సమాజంలోని సమస్యలను వెలికితీస్తూ, ప్రజల గొంతుకగా నిలిచే ఒక జర్నలిస్టు, ప్రమాదవశాత్తూ మంచాన పడితే ఆ కుటుంబం పడే వేదన వర్ణనాతీతం. ఇటీవల జరిగిన ఘోర వాహన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్, ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత ఉపాధ్యక్షులు నిశ్శంకర సురేష్, ఆయన భార్య గాయత్రిలను జనసేన నాయకులు పరామర్శించారు.

​మృత్యుంజయులై తిరిగివచ్చిన వేళ..

​విజయవాడ ఆసుపత్రిలో సుదీర్ఘంగా 16 రోజుల పాటు చికిత్స పొందుతూ, పలు సర్జరీలను ఎదుర్కుని నిన్ననే డిశ్చార్జ్ అయిన సురేష్ దంపతులను జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త అక్కల గాంధీ, జనసేన నాయకులు శీలం బ్రహ్మయ్య తమ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆదివారం పరామర్శించారు. సురేష్‌కు ఐదు సర్జరీలు, ఆయన భార్యకు ఒక సర్జరీ జరగడం ఈ ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోందని గాంధీ అన్నారు. ప్రాణాపాయం నుండి బయటపడటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూనే, కనీసం ఆరు నెలల పాటు కాలు కదపలేని స్థితిలో సురేష్ ఉండటం పట్ల జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.”సురేష్ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా, పార్టీ పరంగా లేదా వ్యక్తిగతంగా మేము అండగా ఉంటాం. ఆ ధైర్యమే వారిని త్వరగా కోలుకునేలా చేస్తుంది.” – అని అక్కల గాంధీ తెలిపారు.

ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి

​జీతం లేని సేవ.. భద్రత లేని జీవితం!

​ఈ పరామర్శ సందర్భంగా అక్కల గాంధీ జర్నలిస్టుల దుర్భర స్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజం పట్ల బాధ్యతతో, సరైన వేతనాలు లేకపోయినా నిత్యం వార్తా సేకరణలో నిమగ్నమయ్యే జర్నలిస్టులు నిజ జీవితంలో పలు వెతలతో సతమతమవ్వడమే కాక, వారిజీవితాలకు భద్రత కరవవ్వడం దురదృష్టకరమని పేర్కొన్నారు.ప్రజా సమస్యలు పరిష్కారమయ్యే వరకు ప్రభుత్వాలను ప్రశ్నించే జర్నలిస్టులు, తమ సొంత సమస్యలు వచ్చేసరికి నిస్సహాయులుగా మారుతున్నారన్నారు గాంధీ.ఆకస్మిక ప్రమాదాలు జరిగినప్పుడు జర్నలిస్టుల కుటుంబాలకు కనీస భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఉప ముఖ్యమంత్రి ​పవన్ కళ్యాణ్ దృష్టికి జర్నలిస్టుల సమస్యలు

క్రీస్తు ప్రేమ, శాంతి ప్రతి ఒక్కరి జీవితాలలో ఎల్లప్పుడూ ఉండాలి..!

​రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరికీ ఆరోగ్య భద్రత కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా జనసేన బృందం హామీ ఇచ్చింది. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి, కూటమి ప్రభుత్వం ద్వారా వారికి ఆరోగ్య భద్రత, భరోసా కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.సురేష్ దంపతులు త్వరగా కోలుకుని, మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఆకాంక్షించారు.సమాజం కోసం అలిసిపోనిది కలం.. ఆ కలం కష్టంలో ఉంటే అండగా నిలవడం మనందరి బాధ్యత! అనే సందేశాన్ని జనసేన నాయకులు ఈ పరామర్శ ద్వారా జర్నలిస్టు కుటుంబాలకు కల్పించారనడంతో సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *