ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న ప్రచారాలను ఖండించారు. శామీర్పేటలో మీడియాతో మాట్లాడిన ఆయన, తాను బీఆర్ఎస్లోకి వెళ్లబోతున్నానన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. గతంలో ఎలాంటి కారణం లేకుండానే ఆ పార్టీ నుంచి బయటకు పంపించారని గుర్తుచేసుకుంటూ, తిరిగి అదే పార్టీలో చేరే పరిస్థితి లేదన్నారు. ఈ తరహా ప్రచారాలను వెంటనే ఆపాలని సూచించారు.రాజకీయాల్లో పార్టీ మారడం అనేది తేలికైన విషయం కాదని, తనకు స్పష్టమైన వైఖరి ఉందని ఈటల రాజేందర్ తెలిపారు.
