ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాస్తూ కీలక అభ్యర్థన చేశారు.భద్రాచలం సమీపంలోని ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని ఆయన కోరారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఈ గ్రామాలను భద్రాచలం పరిధిలో చేర్చడం అవసరమని తెలిపారు.ఈ విలీనంతో గిరిజన ప్రాంతాల సమస్యలు గణనీయంగా తగ్గుతాయని పేర్కొంటూ, ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే సంబంధిత బిల్లును తీసుకురావాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు.
