ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: రాజేంద్రనగర్లో తెలంగాణ హైకోర్టు నూతన భవన సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, హైకోర్టు కొత్త భవనాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 49 కోర్టులు, న్యాయవాదుల నివాస భవనాల నిర్మాణాలను 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.ఈ ప్రాజెక్ట్ కోసం విస్తృత స్థలాన్ని కేటాయించి, ఆధునిక సౌకర్యాలతో దేశంలోనే అత్యున్నత ప్రమాణాల హైకోర్టు సముదాయాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. న్యాయవ్యవస్థకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటని పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్తో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ మరియు ఇతర న్యాయవర్గ ప్రతినిధులు హాజరయ్యారుభవిష్యత్తు తరాల కోసం న్యాయం అందించే ఒక ప్రామాణిక కేంద్రంగా ఈ హైకోర్టు సముదాయం నిలుస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు.









