ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: కేపీహెచ్బీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న యువకుడు, ఓయో గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.అనంతపురం జిల్లాకు చెందిన లోకేష్ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో అంబిక అనే యువతితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పటికీ, యువతి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో సమస్యలు తలెత్తాయి.ఈ నేపథ్యంలో పెళ్లి ఏర్పాట్లు చేసుకున్న ఈ జంట గండిమైసమ్మ ప్రాంతంలోని గదిలో ఉన్నారు. యువతి భోజనం తీసుకురావడానికి బయటకు వెళ్లిన సమయంలో, లోకేష్ ఒంటరిగా ఉండి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.తిరిగి వచ్చిన యువతి తలుపులు తెరిచి చూడగా లోకేష్ వేలాడుతూ కనిపించడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ సమస్యలే ఈ దుర్ఘటనకు కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
