Breaking News

నకిలీ ఏసీబీ అధికారితో మోసం.. తహసీల్దార్ నుంచి రూ.50 లక్షలు దోపిడి

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: శ్రీ సత్యసాయి జిల్లాలో సంచలన మోసం వెలుగుచూసింది. ముదిగుబ్బ తహసీల్దార్ అన్వర్ హుస్సేన్ను నకిలీ ఏసీబీ అధికారిగా పరిచయం చేసుకున్న వ్యక్తి బెదిరించి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఘటన కలకలం రేపింది.తనను ఏసీబీ సీఐగా చెప్పుకుంటూ హరినాథ్ అనే పేరుతో ఫోన్ చేసిన నిందితుడు, అవినీతి కేసులు ఉన్నాయని చెబుతూ సోదాలు చేస్తామని బెదిరించాడు. దీంతో భయపడిన తహసీల్దార్ దఫాదఫాలుగా రూ.50 లక్షలు చెల్లించాడు.కొద్ది రోజుల తర్వాత నిజమైన ఏసీబీ అధికారులు దాడులు చేయడంతో అసలు విషయం బయటపడింది. తాను మోసపోయినట్లు గ్రహించిన తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసును మళ్లీ పరిశీలించిన పోలీసులు, కూడేరు మండలంకు చెందిన హనుమంతును నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. నకిలీ అధికారి వేషంలో బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఇలాంటి మోసాలకు గురికాకుండా అపరిచితుల బెదిరింపులను నమ్మకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని అధికారులు సూచించారు.

వైఎస్సార్‌, రాజారెడ్డిపై టీడీపీ విమర్శలు.. షర్మిల ఫైర్

స్వర్ణాంధ్ర విజన్-2047పై సీఎం చంద్రబాబు సమీక్ష

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *