Breaking News

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. రన్‌వేపై నిలిచిన విమానం

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వేపై విమానం ఆగిపోవడంతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాయపూర్‌కు బయలుదేరాల్సిన విమానం టేకాఫ్ సమయంలో సడన్‌గా నిలిచిపోయినట్లు సమాచారం.ఈ ఘటనతో ఎయిర్‌పోర్ట్ అధికారులు అప్రమత్తమై వెంటనే చర్యలు చేపట్టారు. ల్యాండింగ్‌కు వస్తున్న రెండు విమానాలు గాల్లో చక్కర్లు కొట్టగా, టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న మరో మూడు విమానాలు ఆలస్యమయ్యాయి.ప్రాథమికంగా సాంకేతిక సమస్యే కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయి.

కార్మికు ఉద్యమ నాయకుడు బి టి ఆర్ ఆశయాలు ముందుకు తీసుకెళ్దాం

ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *