ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో ఆరోగ్య రంగంలో కొత్త సాంకేతిక మార్పులకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో హెల్త్ ఏటీఎంలను ప్రవేశపెట్టి రోగులకు వేగవంతమైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటోంది.పైలట్ ప్రాజెక్ట్గా హైదరాబాద్లోని కొన్ని ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన ఈ హెల్త్ ఏటీఎంలు విజయవంతమయ్యాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల దవాఖానల్లో కూడా వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.ఈ యంత్రాల ద్వారా కేవలం కొన్ని నిమిషాల్లోనే 100కి పైగా వైద్య పరీక్షలు చేయవచ్చు. బీపీ, షుగర్, ఆక్సిజన్ స్థాయి వంటి ప్రాథమిక పరీక్షలతో పాటు డెంగ్యూ, మలేరియా, ఈసీజీ వంటి పరీక్షలు కూడా నిర్వహించవచ్చు.డాక్టర్ అవసరం లేకుండానే ప్రాథమిక నిర్ధారణ జరిగే ఈ విధానం, రోగులకు సమయం ఆదా చేయడమే కాకుండా ఆస్పత్రుల్లో రద్దీని తగ్గించనుంది.ఈ హెల్త్ ఏటీఎంల ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డులు కూడా సృష్టించబడతాయి. భవిష్యత్తులో ఆరోగ్య సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు ఇవి కీలకంగా మారనున్నాయని అధికారులు భావిస్తున్నారు.
