Breaking News

ఉజ్వల పథకంతో గ్యాస్‌పై భారీ ఊరట.. సిలిండర్‌కు రూ.300 సబ్సిడీ

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: గ్యాస్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పిస్తోంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద అర్హులైన లబ్ధిదారులకు ప్రతి గ్యాస్ సిలిండర్‌పై రూ.300 వరకు సబ్సిడీ అందిస్తోంది.గ్రామీణ, పేద మహిళలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్ అందించడమే లక్ష్యంగా ప్రారంభమైన ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలు ప్రయోజనం పొందుతున్నాయి. ప్రతి ఏడాది 12 సిలిండర్ల వరకు ఈ సబ్సిడీ వర్తిస్తుంది.అర్హతగా 18 ఏళ్లు పైబడిన మహిళ అయి ఉండాలి. కుటుంబంలో ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు. ఆధార్, రేషన్ కార్డు, బ్యాంక్ వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా గ్యాస్ ఏజెన్సీ వద్ద దరఖాస్తు చేసుకునే వీలుంది. ఈ పథకం ద్వారా గ్యాస్ ఖర్చు తగ్గడంతో పాటు మహిళల జీవన స్థాయి మెరుగుపడుతోంది.

హైదరాబాద్‌లో టెస్లా ఎంట్రీకి రంగం సిద్ధం.. తెలంగాణలో ఈవీ రంగానికి భారీ ఊపు

నిత్యావసరాల ధరల మంట.. ఇప్పుడు బ్రెడ్ కూడా ఖరీదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *