ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: కుప్పంలో టీడీపీ నేతల తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్గ రాజకీయాలకు తావివ్వకుండా అందరూ కలిసి పనిచేయాలని స్పష్టం చేశారు.పార్టీ బలోపేతం కోసం నేతలు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని ఆదేశించారు. పనితీరులో మార్పు రాకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.జూన్ నెలలోగా నేతల వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపించాలని సూచించిన సీఎం, సీనియర్ నాయకులు నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టాలని హితవు పలికారు.స్థానిక స్థాయిలో కార్యకర్తలతో అనుసంధానం పెంచుకుని పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు.
