ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్లో మరో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంను ఈ ఏడాది జులై లేదా ఆగస్టులో ప్రారంభించేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది.నిర్మాణ పనులు దాదాపు 97 శాతం పూర్తయ్యాయని, రన్వే పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ఎయిర్ ట్రాఫిక్, అనుసంధాన రహదారుల పనులు కూడా తుదిదశలో ఉన్నాయని వెల్లడించారు.ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభంతో ప్రయాణికుల రాకపోకలతో పాటు సరుకు రవాణా కూడా మరింత సులభం కానుంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇది కీలకంగా మారనుంది.ఇక రాష్ట్రంలో మరిన్ని విమానాశ్రయాల నిర్మాణానికి కూడా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కొత్త ఎయిర్పోర్ట్లతో జిల్లాల మధ్య కనెక్టివిటీ పెరిగి ఆర్థికాభివృద్ధికి దోహదం అవుతుందని అధికారులు పేర్కొన్నారు.
