Breaking News

బిగ్ అలర్ట్.. 3 గంటల్లో పిడుగులతో వర్షాలు, బలమైన గాలులు

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చే కొన్ని గంటల్లో వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముండగా, అల్లూరి, కాకినాడ, కోనసీమ, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడొచ్చని అంచనా.వర్షాలతో పాటు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిడుగుల సమయంలో బయట తిరగకుండా, సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని హెచ్చరించారు.ఇక తెలంగాణలో కూడా ఉత్తర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఎండలు, వర్షాలు కలిసి భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి.

మైక్రో ఇరిగేషన్‌లో ఏపీ అగ్రస్థానం.. చంద్రబాబు

బాసర ఆలయానికి భారీ అభివృద్ధి.. రూ.225 కోట్ల పనులకు శ్రీకారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *